బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

praveen
కొంత మంది దొంగలు వారి టాలెంట్ ని కూడా వాడుకొని మరి దొంగతనం చేస్తున్నారు. దొరకకుండా ఉండేందుకు ఎన్ని మార్గాలు ఉంటె అన్ని వాడుకుంటున్నారు. తాజాగా ఒక దొంగతనం మాత్రం అందరిని షాక్ కి గురిచేసింది. అసలేం పగలకొట్టకుండా సైలెంట్ గా బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బట్టల షాప్ లోకి వెళ్లి బంగారాన్ని తెచ్చుకున్నారు. వీరి టాలెంట్ చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ఏకంగా 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అసలు ఎలా వెళ్లారు..బట్టల షాప్ లోకి వెళ్లిన వారు బంగారాన్ని ఎలా దోచుకెళ్లారు..ఒక్క అద్దం కూడా పగలగొట్టకుండా వీటిని ఎలా మాయం చేసారు..ఇలా ఎన్నో అనుమానాలు వచ్చేస్తున్నాయి కదా. చలో ఇప్పుడు ఏం జరిగిందో చూసేద్దాం.

హైదరాబాద్ శివారు చందానగర్లోని ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. అయితే ఆ షాప్ కి సంబందించిన ఎటువంటి అద్దాలు, తాళాలు పగలగొట్టలేదు దొంగలు. దొంగలు తెలివిగా షట్టర్ కానీ, డోర్ లు కానీ ఓపెన్ చేయలేదు. దొంగలు ముందు ఒక బట్టల షాప్ ని ఎంచుకున్నారు. బట్టల షాపులోకి వెళ్లిన దొంగలు అందులో నుంచి బంగారం షాపులోకి ఎంట్రీ ఇచ్చారు. ఏమి పగలకొట్టకుండా లోపలి వెళ్లిన దొంగలు బంగారం షాపులో నుంచి ఏకంగా 40 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినట్టు గుర్తించారు. ఇది చూసిన నిర్వాహకులు షాకయ్యారు.

గత కొన్ని నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో దొంగలు హల్ చల్ చేస్తూనే ఉన్నారు. నిత్యం ఎదో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు కొన్ని దేవాలయాల్లో కూడా హుండీలను ఎత్తుకెళ్తున్న వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. పోలీసులు కూడా కట్టడి చేస్తూనే ఉన్నా దొంగతనాల కేసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ బంగారం దొంతనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దొంగలు కూడా అప్డేట్ అవుతూ, టెక్నాలజీని వాడుకుంటూ దొరకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: