వారికి ముగ్గురు ఆడపిల్లలే.. మగపిల్లాడి కోసం ఏం చేశారో తెలుసా?
ఏకంగా ప్రతి కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో మగపిల్లాడి కోసం కొంతమంది చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. అంబర్ పేటలో నివాసం ఉంటున్న వెంకన్న, కవిత అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ప్రతి కాన్పులో మగపిల్లాడు పుడతాడు అని ఆశపడిన వారి ఆశ తీరలేదు. అయితే మగపిడిల్లాడు కావాలని ఆ దంపతులు అనుకున్నారు. దీంతో ఏం చేయాలో వారికి పాలు పోలేదు. ఈ క్రమంలోనే ఒక చెత్త ఆలోచన వారి మనసులో తట్టింది. ఎలాగైనా మగపిల్లాడు కావాలి అని ఆలోచించిన ఆ దంపతులు ఇతరులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
హైదరాబాద్లోని పాతబస్తీ లో ఉన్న మెటాలిటీ ఆసుపత్రి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల శివ కుమార్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేశారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో కంగారు పడిపోయారు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే బాలుడిని అపహరించి వారిని పట్టుకున్నారు. ఇక బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.