బిడ్డను కనాలంటే రూ.2.5 కోట్లు ఇవ్వమన్న భార్య.. భర్త ఏం చేశాడంటే?
అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఇలా పిల్లలు కనడం విషయంలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాస్త సంపాదించిన తర్వాత లేదంటే పెళ్లయిన ఇక కొన్నెళ్ల తర్వాత పిల్లలను కనాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక పెళ్లయిన కొన్ని సంవత్సరాలకి చివరికి పిల్లలను కనడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే భార్య మాత్రం వెరీ కమర్షియల్. అందరూ పిల్లలు కనాలని అమ్మ అని పిలిపించుకోవాలని అనుకుంటే.. ఈమె మాత్రం పిల్లలు కనడానికి డబ్బులు అడిగింది. అది కూడా వేళల్లో లక్షల్లో కాదు కోట్లలోనే డిమాండ్ చేస్తుంది.
దీంతో ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దుబాయ్ లో ఉండే ఒక మిలియనీర్ భార్య బిడ్డలను కనేందుకు వింత శరతు పెట్టింది. తనకు నెలకు 2.5 కోట్లు చెల్లిస్తే తన భర్తతో బిడ్డను కంటాను అంటూ ఆమె ప్రకటించింది. అయితే ఉచితంగా తాను పురిటి నొప్పులు భరించాలని అనుకోవట్లేదు అంటు నిర్మొహమాటంగా చెప్పేసింది సదరు మహిళ. తాను గర్భం దాల్చకముందే తనకు తన భర్తకు మధ్య ఇలాంటి ఒప్పందం కుదిరింది అంటూ చెప్పుకొచ్చింది. భర్త సంపాదనను ఖర్చు చేయడం అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. అయితే ఆమె వింత శరతుకి ఏకంగా భర్త కూడా ఒప్పుకోవడం మాత్రం అందరిని మరింత షాక్ కి గురిచేస్తుంది.