భార్యపై అనుమానం.. చివరికి భర్త ఏం చేశాడో తెలుసా?
అయితే భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి అంటే వారి బంధంలో నమ్మకం అనేది ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే అటు బంధం నిలబడుతూ ఉంటుంది. ఏ చిన్న అనుమానం ఉన్న కూడా అది చివరికి దారుణమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా కట్టుకున్న వారిపై అనుమానాన్ని పెంచుకొని ఏకంగా హత్యలు చేసిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి తరహా ఘటనే అని చెప్పాలి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి ఓ రోజు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారులో వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలి సమీపంలోని మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. మీర్జా గూడ పరిధి ఇంద్ర రెడ్డి నగర్ లో ఉండే వడ్డే. మాణిక్యం, యాదమ్మ దంపతులు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని రోజుల నుండి అటు భార్య యాదమ్మను అనుమనిస్తూ వచ్చాడు భర్త మాణిక్యం. సూటిపోటి మాటలు అంటూ వేధిస్తూ ఉండేవాడు. అయితే అతనిలో ఉన్న అనుమానం పెనుభూతంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై బండరాయితో మోది.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.