ఆడపిల్లలు పుట్టిందని.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
నేటి ఆధునిక సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్ష మునుపటితో పోల్చి చూస్తే తగ్గిపోయిందా అంటే తగ్గిందే అనే సమాధానం ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే భారంగా భావించేవారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుట్టింది అని తెలిస్తే కనీసం భార్య మొహం కూడా చూడకుండా విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డఘటనలు కూడా ఎన్నోసార్లు వెలుగులో వచ్చాయి.  ఇంకొన్నిసార్లు ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన ముక్కుపచ్చలారని శిశువుపై కూడా కాస్తైనా జాలి దయ చూపించకుండా ఏకంగా దారుణంగా చెత్త కుప్పల్లో పడేసిన ఘటనలు కూడా వెలుగు చూసాయ్.

ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజం తీరును చెప్పకనే చెప్పాయి అని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి తరహా ఘటనలు  జరగడం లేదు. ఆడపిల్ల పుట్టాల మగపిల్ల పుట్టాడా అన్న విషయం మన చేతుల్లో లేదని.. ఎవరు పుట్టిన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే అని అనుకోవాలి అంటూ అందరూ అనుకుంటున్నారు.  కొంతమంది అయితే ఆడపిల్ల పుట్టాలి అని నోములు,  వ్రతాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేటి ఆధునిక సమాజంలోసభ్య సమాజం తలదించుకునే ఒక అమానవీయ ఘటన జరిగింది.

 ప్రస్తుతం ఈ ఘటన గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెం కు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి భార్యాభర్తలు వీరికి 2021లో పెళ్లి జరిగింది. అయితే 20 రోజుల క్రితం భారత ప్రమాదవశాత్తు చనిపోయాడు అయితే ఇలా భర్త మరణం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలి ఇక వారం క్రితమే ప్రసవించింది. అప్పటికే ఈ దంపతులకు ఒక ఆడబిడ్డ ఉండగా ఇక ఇప్పుడు ఒకే ప్రసవంలో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇలా ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఇక అత్యంత వారు కుసుమాంజలని ఇంట్లోకి రానివ్వలేదు దీంతో న్యాయం చేయాలంటే పోలీసులను ఆశ్రయించింది బాధితులను.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tag

సంబంధిత వార్తలు: