ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాడు.. కానీ?
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎన్నో ప్రాంతాలలో జలపాతాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ జలపాతాలను చూసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు చాలా మంది విహారయాత్రలను ప్లాన్ చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా విహారయాత్రకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఆ యాత్ర ఎంతో మధురానుభూతిగా మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇలా సరదాగా విహారయాత్రకు వెళ్లినప్పుడు ఊహించని ఘటనలు జరిగితే.. చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తే అందరికీ చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి.
స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఒక వ్యక్తికి చివరికి ఆ యాత్ర చివరి రోజుగా మారిపోయింది. ఎందుకంటే అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని ఘట్కేసర్ మండలం చౌదరిగుడా వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మక్తాకు చెందిన జగదీష్ అనే 42 ఏళ్ళ వ్యక్తి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవలే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లోని వైజాగ్ కాలనీ విహారయాత్రకు వెళ్ళాడు. అయితే ఇటీవలే జగదీష్ నీటిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. జాలర్లు సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కొడుకు మృతి పై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.