సాంగ్స్ వింటుండగా చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. చివరికి ఏమైందంటే?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం ప్రతి పనిని పూర్తి చేసుకునేందుకు.. స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటం చేస్తూ ఉన్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇలా టెక్నాలజీ మీదే మితిమీరి మరి ఆధారపడిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ చివరికి మనుషులకు ప్రమాదకరంగా  మారిపోతున్నాయి. ఏకంగా మొబైల్ అతిగా వాడటం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు మనిషి.

 కొన్ని కొన్ని సార్లు ఏకంగా మొబైల్ బ్లాస్ట్ అయ్యే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాడుతున్న గ్యాడ్జెట్ ఏదైనా ఉంది అంటే అది ఇయర్ బడ్స్ అని చెప్పాలి. ఇక వీటిని చెవిలో పెట్టుకున్నారు అంటే లోకాన్ని సైతం మర్చిపోతూ ఉంటారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే ఇలాంటి అలవాటుతో ఎన్నోసార్లు ప్రమాదంలో పడిపోతున్నారు. అయితే ఇయర్ బడ్స్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఒక ఘటన ఇక్కడ జరిగింది.

 ఏకంగా చెవి లో ఇయర్ బడ్స్ పెట్టుకొని హాయిగా సాంగ్స్ వింటున్న సమయం లో షాకింగ్ ఘటన జరిగింది. ఏకంగా అవి చెవిలో పేలి పోయాయి. టర్కిలో ఈ ఘటన జరిగింది. శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడం తో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్* ని వాడుతున్న క్రమం లో ఇక అవి బ్లాస్ట్ అయ్యాయని యువతి ప్రియుడు చెప్పుకొచ్చాడు. అయితే దీని పై శాంసంగ్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శాంసంగ్ ఇయర్ బడ్స్ సేఫ్టీ విషయంలో ప్రస్తుతం అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: