పౌరసత్వ వివాదమే ఆ ఎమ్మెల్యే కొంప ముంచిందా?

Chakravarthi Kalyan
మంత్రి కేటీఆర్ ఇటీవల సిరిసిల్ల వెళ్లడం జరిగింది. అప్పుడు వేములవాడకు సంబంధించిన చెన్నమనేని రమేష్ వర్గం వాళ్లు అక్కడికి వచ్చారట. అయితే  అప్పుడు కేటీఆర్ వాళ్లతో మాట్లాడడం గాని, పట్టించుకోవడం గాని చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారట. అప్పటికీ చెన్నమనేని రమేష్ వర్గం కేటీఆర్ కారు వెనుక  పరిగెత్తుకు వెళ్ళినా సరే పట్టించుకోకుండా వెళ్లిపోయారట కేటీఆర్. అయితే ఆయన మాత్రమే కాకుండా ఆయన సన్నిహితులు కూడా వీళ్ళని పట్టించుకోలేదని  తెలుస్తుంది.


జర్మనీ పౌరుడైన ఒక వ్యక్తి అక్కడ మేయరుగా పని చేసి ఇక్కడకి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇప్పటి వరకూ ఎవరూ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ఆ తర్వాత  ప్రత్యేక తెలంగాణ చరిత్రలో గాని ఇలా ఎవరూ లేరు. అయితే ఇదే విషయంపై  కోర్టులో కేసులు వేస్తే రాజ్యాంగపరమైన ప్రశ్నలు రేకెత్తించారు. ఆ ప్రశ్నలు రేకెత్తించే లోపు ఆ టర్మ్ అయిపోయిందట. ఆ తర్వాత దాని పై టర్మ్ కూడా అయిపోయిందట.


దీనికి కారణం ఇక్కడి కోర్టులు, కేసులు, తీర్పులు బలహీనంగా ఉండడమే  అని అంటున్నారు.  చివరికి దీనిపై కేంద్రం హోం శాఖను నివేదిక కోరింది. హోం శాఖ కూడా కేంద్రానికి నివేదికను సమర్పించింది. కానీ కోర్టులో మాత్రం కేసు జరగ లేదు. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా ఇటు కేసీఆర్ మాత్రమే కాదు అటు కేటీఆర్ కూడా జాగ్రత్తగానే ఉన్నారు అని తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీ నరసింహ రావును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.


లక్ష్మీనరసింహారావుని ఎన్నుకోవడంతో ఆయన అభిమానులు సంతోషంగా సంబరాలు చేసుకున్నారట. బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో కేసిఆర్ ఈయన పేరును కూడా చెప్పారని తెలుస్తుంది. నియోజక వర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకుని మూడో సారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలుపుకు వస్తానని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: