ముస్లిం రాజ్యాల నడుమ ఇజ్రాయెల్ ఒంటరిపోరాటం?
అయితే ఈజిప్టు పాలస్తీనా కు ఆనుకొని ఉంటుంది. పైగా ఆ దేశానికి మిత్ర పక్షం. ఈ సమయంలో గాజాలో ఉన్న 14లక్షల మంది ప్రజలను తమ దేశంలోకి రానివ్వకుండా రఫా సరిహద్దు వద్ద ఎక్కడానికి వీల్లేకుండా సుమారు 40 అడుగుల ఎత్తు మేర గోడ కట్టింది. వాటిపై మళ్లీ ముళ్ల కంచెలు ఏర్పాటు చేసింది. హమాస్ తీవ్రవాదులు తమ దేశంలోకి ఎక్కడ వస్తారేమో అనే భయంతో ఈ తరహా చర్యలకు పాల్పడింది. లేకపోతే ఇజ్రాయెల్ దాడి తట్టుకోలేక తమ దేశంలోకి వస్తారని భయపడింది.
ముస్లిం పక్షపాతి అని చెప్పుకుంటూ పాలస్తీనా పై దాడి ఆపాలని ఇజ్రాయెల్ ను కోరింది. మానవ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. పరిస్థితి ఇలానే కొనసాగితే తీవ్ర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ను హెచ్చరించింది. మరోవైపు గాజా శరణార్థుల విషయంలో మాకు సానుభూతి ఉంది. కానీ సహాయం విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ పేర్కొన్నారు.
ఒకప్పుడు యూదులు ఇచ్చిన డబ్బులకు ఈజిప్టు తమ భూ భాగాన్ని అమ్ముకొంది. ఈజిప్టు దగ్గర భూమిని కొనుగోలు చేసి ఇజ్రాయెల్ ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు తాము అమ్మిన భూ భాగాన్ని లాక్కొనేందుకు ఈజిప్టు యత్నిస్తోంది. కానీ ఇజ్రాయెల్ బలమైన దేశం కాబట్టి ఈ దేశాలన్నింటిని ప్రతిఘటిస్తోంది. అప్పుడే సిరియా, లెబనాన్, గాజా ఈ వ్యవహారాలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ దశలో నడుస్తుందే తాజా అంశం. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో..?