చంద్రబాబు, జగన్.. ఇద్దరిపైనా కస్సుమంటున్నారు?
ఎందుకంటే ఎగువ మధ్య తరగతి వారు పేదలకు పని కల్పిస్తూ ఉంటారు. ఈ పనికోసం పేదలు ఆశగా ఎదురు చూస్తూ వీరు చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. ఇచ్చింది తీసుకొని వెళ్తుంటారు. కానీ జగన్ వచ్చిన తర్వాత నేరుగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వీరంతా పని చేసేందుకు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఇచ్చింది తీసుకునే పేదలు ఇప్పుడు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు. దీంతో పేదలపై వీరికి పెత్తనం పోయింది. ఇది ఎగుమ మధ్య తరగతి వారికి రుచించడం లేదు. ఒకవేళ జగన్ బదులు చంద్రబాబు పదవిలోకి వస్తే ఇంతకు మించి సంక్షేమాన్ని అందిస్తానని అంటున్నారు. గతంలో శ్రీలంక, వెనుజులా అవుతుందని ప్రభుత్వ పథకాలను విమర్శించిన.. ఆయన ఇప్పుడు తాము వచ్చి సింగపూర్ చేస్తానని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరిపై ఈ వర్గం వారు గుర్రుగా ఉన్నారు. దీనికి ఏ పరిష్కారం లేదేమో.