మొన్న తనను దెబ్బ తీసిన వారిని.. ఇప్పుడు జగన్ ఆదుకుంటాడా?
దీంతో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అంతా అవుట్ రేట్ గా టీడీపీ కూటమికి తమ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ద్వారా తమ సీపీఎస్ రద్దు డిమాండ్ ని నెరవేర్చుకోవాలని ఉద్యోగులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమ కోరిక తీరుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై విధి విధానలు ఖరారు కాలేదు కానీ దాదాపు సీఎం చంద్రబాబు కూడా జీపీఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
దీనిని ఆసరాగా తీసుకొని వైసీపీ తన అనుకూల మీడియా టీవీ, పేపర్లలో ఉద్యోగులకు అనుకూలంగా కథనాలు ప్రచురిస్తోంది. గతంలో ఎల్లో మీడియా ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అని రాస్తే.. నేడు అదే ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. నాడు ఉద్యోగులకు టీడీపీ నేతలు, మీడియా అండగా ఉంటే.. నేడు వైసీపీ నాయకులు, వారి మీడియా వారి తరఫున ఉంది. మొత్తం ఉద్యోగుల డిమాండ్లు మాత్రం నెరవేరడం లేదు అనేది వాస్తవం.