చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన మోదీ?

Chakravarthi Kalyan

భారత్ కి దాయాది దేశం పాకిస్థాన్ తలనొప్పిగా మారింది. ఉగ్రవాదులను, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ భారత్ లో అలజడికి ప్రయత్నిస్తోంది. ఐదేళ్లుగా మరో పొరుగు దేశం చైనా కూడా తన చర్యలతో భారత్ ను కవ్విస్తోంది. తరచూ సరిహద్దులు మారుస్తూ.. మ్యాప్ లు విడుదల చేస్తోంది.


గాల్వాన్ లో అయితే చొరబాటుకు ప్రయత్నించింది. భారత సైన్యం దానిని తిప్పికొట్టింది. అప్పటి నుంచి భారత్ ను చైనా కవ్విస్తోంది. దీంతో మోదీ కూడా చైనాకు చెక్ పెట్టే చర్యలు మొదలు పెట్టారు. పలు చైనా యాప్ లను బ్యాన్ చేసి కోట్ల రూపాయలు ఆదాయానికి గండి కొట్టాడు. చైనా తయారీ వస్తువులు దిగుమతులపై ట్యాక్స్ లు విధించారు. చాలా వరకు దిగుమతులు తగ్గించారు. ఈ నేపథ్యంలో చైనా దొడ్డి దారిన భారత్ పై నిఘా పెడుతోంది. మనతో సన్నిహితంగా ఉండే.. శ్రీలంక, మాల్దీవులను మచ్చిక చేసుకొని సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది.


ఇక భారత్ సరిహద్దుల్లో అనేక నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా చైనా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. పొరుగు దేశాలపై నిఘా కోసం చైనా ప్రత్యేకంగా బెలూన్లు తయారు చేసి వినియోగిస్తుంది. తాజాగా ఈ బెలూన్లను కూల్చివేసి అంశంపై వాయుసేన దృష్టి పెట్టింది. దాదాపు 15 కి.మీ. ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువులను కూల్చడంపై ఎయిర్‌ ఫోర్స్ కమాండోలకు శిక్షణ ఇచ్చింది.


అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్లకు కూల్చే ఆపరేషన్ లో రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలోడన్ కూడా అమర్చారు.  దీనిని 55 వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపణిని ప్రయోగించి కూల్చేశారు.  దీంతో గగనతలం నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చే సత్తాను భారత్ ఏర్పాటు చేసింది. ఇక డ్రాగన్ కంట్రీ 2023 నుంచి నిఘా బెలూన్లను ప్రయోగిస్తోంది. అమెరికాల్ దక్షిణ కరోలినా గగనతలం లో ఓ బెలూన్ ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది.  ఈ నిఘా బెలూన్లపై ప్రత్యేక పరికరాలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.  ఈ నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు గగన తలం పేల్చే సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: