విలాసాల్లో బాబు కూడా తక్కువేమీ కాదు..?

Chakravarthi Kalyan

వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన ఇంటి చుట్టూ కట్టిన  ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ఈ  సమయంలో అసలు ప్రజల సొమ్ము దుబారా చేయడంతో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని బాబు దుబారా అనే పోస్టర్ ని విడుదల చేసింది వైసీపీ.


అవును  సీఎంలుగా ఉన్న సమయంలో జగన్, చంద్రబాబు ప్రజా సొమ్మును ఎంతెంత దుబారా చేశారనే విషయాలపై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇంటి ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో చంద్రబాబు 2014-19  మధ్య కాలంలో సీఎం గా ఉన్న సమయంలో ఆయన విలాసాలు, హంగులూ ఆర్భాటాలు, సొంత ఇళ్లు, క్యాంపు ఆఫీసులకు పెట్టిన ఖర్చు వందల కోట్లకు పైమాటే అని చెబుతూ..


క్యాంప్ ఆఫీసులు, వాటి మరమ్మతులు, సీసీ కెమెరాల పేరిట చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేవారంటూ ఏకంగా ఓ పోస్టర్ ని రీలిజ్ చేసింది వైసీపీ. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు, మదీనాగూడ ఫాంహౌస్ , జూబ్లీ హిల్స్ లోని ఇంటికి రూ.4.37 కోట్లు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం క్యాంపు ఆఫీసు విజయవాడ కు రూ.42 కోట్లు, తాత్కాలిక సచివాయలం, మరమ్మతులు కోసం రూ.100 కోట్లు, సీఎం ప్రత్యేక బస్సు కు రూ.5.50 కోట్లు, సీఎం కార్యాలయం ఫర్నీచర్ కు రూ.10 కోట్లు ఖర్చు  చేశారని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.


ఇదే క్రమంలో ప్రత్యేక విమానాలు, నవ నిర్మాణ దీక్షలు, పోలవరం ఈవెంట్లు, బస్సు యాత్రలు, ఎన్నికల ముందు ప్రచారాలు, రాజధాని లో సింగపూర్ సెట్టింగులు, గుంటూరు జిల్లాలో ఈవెంట్లు మొదలైన వాటికి మొత్తం చేసిన దుబారా ఖర్చు రూ.3628.17 కోట్లు అని వైసీపీ లెక్కలతో వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: