సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడినట్లేనా? అమలు చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో తెలుసా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. సూపర్ సిక్స్ ను అమలు చేసి తీరుతామని తెలిపారు.  అందులో పింఛన్లు అమలు చేశారు. నెలకు నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన మరుసటి నెల నుంచే అమలు చేయడం ప్రారంభించారు.


ఇందుకోసం అదనంగా ఖర్చవుతుంది. దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి మూడు వేల రూపాయలు ఖర్చవుతుంది. జనవరి నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్న తల్లికి వందనం పథకానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అయితే ఆర్థిక శాఖ అధికారులు సూపర్ సిక్స్ అమలు కోసం ఎంత మేర ఖర్చవుతుందన్న దానిపై లెక్కలు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1.20 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాధమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.


గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సుమారు 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం అదనంగా మరో నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. వీటిని ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్రం నుంచి ఆదాయ వనరుల సమీకరణ ఎలా? అన్న దానిపైనే ఈ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.  ప్రభుత్వోద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లించడానికి పోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి అదనంగా చాలా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.


ఎఫ్ఆర్‌ఎంబీ కి లోబడి రుణాలను పొందాల్సి ఉంటుంది. దానిని మించితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.  నిధుల కేటాయింపు పై స్పష్టత ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది. శాఖల వారీగా ఆదాయాన్ని పెంచుకోవడం ఒక మార్గమని భావిస్తుంది. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపు మార్గాల కోసం అన్వేషిస్తున్నారు ఉన్నతాధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: