చంద్రబాబు ప్లేస్ ఆక్రమిస్తున్న ఆర్ఆర్ఆర్..?
ఎందుకంటే.. రోజూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఠంచనుగా ఒంటి గంటకల్లా ప్రెస్మీట్లో అందుబాటులో ఉంటాడు.. రోజుకో టాపిక్ ఎత్తుకుని జగన్ సర్కారును కడిగిపారేస్తారు.. అదేదో మళ్లీ విమర్శించినట్టుగా కాకుండా వినమ్రతతో చెబుతాడు. అంతే కాదు.. ఆయన లేవనెత్తే లాజిక్కులు అటు టీడీపీ వాళ్లు కూడా ప్రస్తావించరు. అంత క్లారిటీగా వుంటాయి ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శలు. అంతే కాదు.. ఆయన జగన్ సర్కారు తప్పదాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తుంటాడు. ఏమాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడు.
తాజాగా.. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారో బయటపెట్టాలంటూ ప్రెస్ మీట్ పెట్టి లాజిక్ లాగారు. సిబిఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్మాండవీయాకు లేఖ కూడా రాశాడట. అన్నీ పరిశీలించాల్సి నిర్ణయం తీసుకుంటానని సదరు మంత్రిగారు చెప్పారట. ఇదే సమయంలో అమరరాజా కంపెనీలో కాలుష్యం గురించి కూడా ప్రస్తావించారు ఎంపీ రఘురామ.
ప్రజల ఆరోగ్యం గురించి అంత పట్టింపు ఉంటే.. ప్రభుత్వ సరఫరా మద్యం వల్ల పాడవుతున్న ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు.. లాజిక్కే కదా.. ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్ల ఎంత మంది కాలేయం దెబ్బతిన్నదో... అమరరాజ సంస్థ వల్ల ఎంత మందికి దెబ్బతిన్నదో వివరాలు సేకరిస్తే నిజాలు బయటికి వస్తాయని సెటైర్ వేశారు. మరి ఇన్ని లాజిక్కులు లాగుతున్న రఘురామని ప్రతిపక్షనేత అంటే తప్పేముంది..?