డిగ్రీలతో బయటకొచ్చే ప్రతి విద్యార్థికీ ఉపాధి?

Purushottham Vinay
బాగా చదువుకునే విద్యార్థులకు ఉపాధి కల్పించేలా ప్రస్తుత బోధన విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి అన్నారు.ఈ దిశగా యూనివర్సిటీల ఉప కులపతులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్ ఇంకా టీఎస్‌ ఆన్‌లైన్‌ నేతృత్వంలో 'ఉపాధి అవకాశాల పెంపునకు సాధికార విద్య' అనే అంశంపై సోమవారం నాడు హైదరాబాద్‌లో సెమినార్‌ జరిగింది.ఇక ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న సబిత మాట్లాడుతూ, డిగ్రీలతో బయటకొచ్చే ప్రతి విద్యార్థికీ కూడా ఖచ్చితంగా ఉపాధి లభించేలా చూడాలన్నారు. నైపుణ్యత పెంచడం ద్వారానే ఇది సాధ్యమని ఆమె తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల్లోనే ప్రవేశాలు కావాలని కోరుకుంటున్నారని, అలా కాకుండా అన్ని కాలేజీల్లో కూడా ప్రవేశాలు కోరుకునే విధంగా ఆయా కాలేజీల్లో బోధన విధానంలో మార్పు తేవాలని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మొత్తం ఏడు లక్షల మందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించినట్టు ఆమె తెలిపారు.మంచి నైపుణ్యంతో కూడిన విద్యతోనే ఉపాధి అవకాశాలుంటాయని ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అయిన జయేశ్‌ రంజన్‌ తెలిపారు.


పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ఇంటర్న్‌షిప్‌ ఉండాలన్నారు. మార్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంచి ప్రాజెక్టు వర్క్‌పైనే దృష్టి పెట్టాలని చెప్పారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే ఉపాధి వెంట పరుగులు పెట్టేకన్నా, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.20 సంవత్సరాల నాటి పుస్తకాలతోనే ఇంకా బోధన సాగుతుండటం శోచనీయమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా విద్య సాగాలని చెప్పారు. విద్యలో నాణ్యత ఇంకా పరిణతి పెరగాల్సిన అవసరం ఉందని టీసీఎస్‌ భారత విభాగం ముఖ్య అధికారి అయిన గోపాలకృష్ణ జీఎస్‌ఎస్‌ తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎన్నో రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. హానర్స్ ఇంకా అలాగే బీఎస్సీలో డేటా సైన్స్‌ వంటి కోర్సులను ఉదహరించారు. మండలి వైఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి వెంకటరమణ ఇంకా అలాగే పలు యూనివర్శిటీల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: