ఆ మీడియాకు బుర్ర‌లేన‌ట్టుందే... చంద్ర‌బాబు విష‌యంలో ఏం చేసిందో చూడండి..!

VUYYURU SUBHASH

ప్ర‌జ‌లు మారారు.. వ్య‌వ‌స్థ మారింది.. దీంతో రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది. ఇది జ‌రిగి ఏడాది గ‌డిచింది. కానీ, ఈ ఏడాది కాలంలో మార‌నిద‌ల్లా.. ఓ వ‌ర్గం మీడియా. ఇంకా టీడీపీనే అధికారంలో ఉంద‌ని, సీఎంగా చంద్ర‌బాబు మాత్ర‌మే ఉన్నార‌ని క‌ల‌లు కంటూనే ఉంది. అందుకే.. నిత్యం ఏడుపుగొట్టు రాత‌ల‌తో ప్ర‌జ‌ల ‌కు పేప‌ర్లు అమ్ముకుంటోంది. చంద్ర‌బాబు హ‌యాంలో అలా చేశారు.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించారు.. అని మ‌ళ్లీ మ‌ళ్లీ.. పాడిందే పాట అన్న‌ట్టుగా రాసుకుంటూ వ‌స్తోంది. అంతేకాదు, బాబు పాల‌న‌లో రాష్ట్రం సుభి క్షంగా ఉంది. 

 

ఆయ‌నే ఉండి ఉంటే.. అంటూ ఇంకా ఊహాజ‌నిత క‌థ‌నాలు ప్ర‌చారం చేస్తూనే ఉంది. కానీ, వాస్త‌వం ఏంటి? చ‌ంద్ర‌బాబు హ‌యాంలో నిజంగానే కొన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఒప్పుకుందాం. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా ఆయ‌న కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు. కోట్ల‌కు కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని కేటాయించారు. వివిధ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. అయితే, ఇవి ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయి?  ఎవ‌రికి ల‌బ్ధి చేకూర్చింది? అంటే... ఇక్క‌డే ఉంది.

 

అస‌లు మ‌త‌ల‌బు. ఆయా సామాజిక వ‌ర్గాల్లో టీడీపీకి అనుకూ లంగా ఉన్న‌వారి ల‌బ్ది చేకూర్చాయి. లేక‌పోతే.. ఇంకా కాపుల్లో పేద‌లు ఎందుకు ఉన్నారు? ఇంకా, {{RelevantDataTitle}}