హెరాల్డ్ ఎడిటోరియల్ : వైజాగ్ రాజధానిగా జగన్ కు కేంద్రం మద్దతు తెలిపిందా ? మోడి రాక ఖాయమేనా ?
అయితే అటువంటి వాళ్ళ ఆశలన్నీ తాజా పరిణామాలతో పటాపంచలైపోయుంటాయి. ఇంతకీ కేంద్రం మద్దతు ఏ విధంగా వచ్చిందంటే జాతీయస్ధాయిలో విస్తరించాలని కేంద్రం అనుకున్న 26 జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో మూడింటిని ఏపికే కేటాయించింది. ఈ మూడు కూడా జగన్ విజ్ఞప్తి మేరకు విశాఖపట్నం కేంద్రంగా కేంద్రం మంజూరు చేయటమే విశేషం. హైదరాబాద్-భద్రాచలం-వైజాగ్ ఒకటి, విశాఖపట్నం-నాగ్ పూర్ మధ్య రెండోది, ఇక మూడో జాతీయ రహదారి వైజాగ్ టు రాయపూర్. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవాలని జగన్ డిసైడ్ అయిన తర్వాత కేంద్రానికి ఓ లేఖ రాశాడు. విశాఖపట్నం కేంద్రంగా మూడు జాతీయ రహదారులను శాంక్షన్ చేయాలంటూ లేఖలో కేంద్రాన్ని కోరటం, అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే శాంక్షన్ చేసేయటం ఆశ్చర్యంగా ఉంది.
జగన్ లేఖకు అనుగుణంగా కేంద్రం ఇంత స్పీడుగా రెస్పాండ్ అయిన తీరుతోనే వైజాగ్ రాజధాని ప్రతిపాదనకు కేంద్రం కూడా పూర్తిగా మద్దతు పలుకుతోందనే విషయం అర్ధమవుతోంది. సరే హైకోర్టులో కేసుల కారణంగా శంకుస్ధాపన మహాఅయితే ఓ నాలుగు రోజులు ఆలస్యం అయితే అవ్వచ్చంతే. ఇక శంకుస్ధాపనకు ప్రధానమంత్రి వస్తాడా ? రాడా ? అన్నదే సస్పెన్సుగా మారింది. ఇప్పటికైతే ప్రచారంలో ఉన్నట్లుగా అక్బోబర్ 25వ తేదీన విజయదశమి రోజున వైజాగ్ లో సచివాలయం నిర్మాణానికి ముహూర్తం ఫిక్సయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ అంటే ఇంకా చాలా రోజులున్నా ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వనించాలంటే కన్ఫర్మేషన్ ఇప్పుడే తెలియాలి. ఆ కన్ఫర్మేషన్ కోసమే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం.