హెరాల్డ్ ఎడిటోరియల్ : ఐక్యతేదీ..? పోరాటమేదీ..? విజయాల కల అత్యాశ కాదా?
తెలంగాణలో బీజేపీ బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం ఏకకాలంలో జరుగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో దూకుడు పెంచిన బీజేపీ, గ్రేటర్ ఫలితాలతో మరింత జోష్ నింపుకుంది. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించుకుంది. అన్నట్లుగానే టీఆర్ఎస్ తో తలపడుతోంది. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికిని కూడా చాటులేకపోతోంది. ఎన్నికల్లో కాదు… ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
జాతీయ స్థాయిలోనూ నాయకత్వం విషయంలో అనిశ్చితే కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లేదా గాంధీ,నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కొత్త నీరు రాకతో పాత నీరు వదిలిపోతుంది. ఇక్కడ గాంధీ, నెహ్రూ కుటుంబం లేకుండా అసలు కాంగ్రెస్ మనుగడే కష్టంగా పరిణమించింది. కాంగ్రెస్లోనే అంతర్గత మార్పుల కోసం కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీ సమావేశాలు జరిపి నాయకులను ఎంచుకోవడం, రాష్ట్రాల అధ్యక్షుల నియామకం చేయడంలో తత్సారం చేస్తూ నమ్ముకున్న నాయకులను కూడా ఆయారాష్ట్రాలలోను, ప్రాంతీ యంగా కోల్పోతుంది. కిందిస్థాయిలో కాంగ్రెస్ను నమ్ముకొని పని చేస్తున్న కేడర్కు కానీ,కార్యకర్తలకు కానీ మేమున్నాం అని భరోసా నిచ్చే నాయకులు కరువయ్యారు.