షర్మిల పార్టీ: పీకే శిష్యురాలు చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు..?
అలాంటి ఓ కన్సల్టెంట్ షర్మిల పార్టీ గురించి చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వేను పొలిటికల్ సైంటిస్టుగా పేరున్న ప్రశాంత్ కిశోష్ టీమ్లో ప్రియా చేయించిందట. ఆమె ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఈ సర్వే చేసిందట. దాదాపు మూడు నెలల నుంచి తెలంగాణలో చాలా సీక్రెట్గా ఈ సర్వే చేశారట. తెలంగాణలో వైఎస్సార్కు ఇంకా ఎంత మంది అభిమానులు ఉన్నారు? వైఎస్ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? తెలంగాణలో పార్టీ పెడితే షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనే అంశాలపై సర్వే జరిగింది.
తెలంగాణలో షర్మిల సీఎం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది. ? ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ టీఆర్ఎస్ బలంగా ఉన్నారు.. వారికి ధీటుగా షర్మిల ఎవర్ని రంగంలోకి దింపాలి? తెలంగాణలో సత్తా ఉన్న బలమైన నేతలెవరు? అనే అంశాలపై ఈ టీమ్ సర్వే నిర్వహించిందట. ఈ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో వైఎస్ పై అభిమానం చెక్కుచెదరలేదట. దీంతో ఈ సర్వే ఫలితాలపై షర్మిల చాలా సానుకూలంగా ఉన్నారట.
షర్మిల తన పార్టీ ప్రకటన ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగింది. ఇలా తాను చేయించుకున్న సీక్రెట్ సర్వే ఫలితాలు ఇచ్చిన దన్నుతోనే ఆమె ముందడుగు వేస్తున్నారట. తెలంగాణ వాదం గట్టిగా బలపడిన చోటే అయినా.. పార్టీ పెడితే వైఎస్ బొమ్మతో గెలుస్తానని ఆమె నమ్ముతోంది. మరి గ్రౌండ్ లెవల్లో చేపట్టిన ఈ సీక్రెట్ సర్వే ఎంత వరకూ నిజం అవుతుందో మరి.