థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీలకు మేలు
కొన్ని పోరాటాలకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కు కేంద్రంలో బాగుంటుంది. అదే పని చంద్రబాబు చేయిస్తే టీడీపీకి రాష్ట్రంలో బాగు పడేందుకు బాగుంటుంది. బాగున్నవన్నీ కామ్రెడ్లు అందించి పాపం వాళ్లే ఇరకాటంలో ఉండిపోతారు.. అధికారం వారికి ఇచ్చి మళ్లీ పెట్టుబడీదారులంటూ కోపం అవుతారు? ఇదెక్కడి చోద్యం. ఇదే సమయంలో ఛలో ఢిల్లీ పోరాటానికి పూర్వమే సాయిరెడ్డి కొందరు కమ్యూనిస్టులను ఢిల్లీకి రప్పించుకుని, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యేలా చేసి, విశాఖ స్టీలు పోరాటంలో కొన్ని అమలు సూత్రాలు తమవి కూడా ఉన్నాయని నిరూపించుకునేందుకు ఆరాటపడ్డారు. అలా ఒక పోరు మూడు పార్టీలకూ సాయం చేసింది.
ఎప్పుడూ మాట్లడని వారు మాట్లాడుతుంటే ఆశ్చర్యం పుట్టుకువస్తుంది. అందుకు టీడీపీలో ఉన్న కొందరు ఎంపీలే కారణం అవుతున్నారు. నేను ఎవర్ని అని ప్రభాస్ రేంజ్ లో నిన్న కూడా అరిచారు టీడీపీ ఎంపీలు.. వారికి ఇంతటి చొరవ దక్కడం వెనుక చంద్రబాబు ఉన్నారు అన్నది కాదనలేని వాస్తవం. స్టీల్ వార్ పై తమదే పేటెంట్ అన్న విధంగా పరిణామాలు మార్చుకునేందుకు చంద్రబాబు ఊహించిన విధంగా, నిర్దేశించిన విధంగా టీడీపీ ఎంపీలు మాట్లాడడం బాగుంది. కనక మేడల లాంటి వారు లా పాయిం ట్లు రైజ్ చేస్తే ఇంకా బాగుండు. ఏదేమైనప్పటికీ ఒక యుద్ధం రెండు కాదు మూడు పార్టీలకు ప్రభావితం చేయడం ఖాయం.దేశ రాజధానిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేపట్టిన పోరు విజయవంతం అయింది. విశాఖ ఉక్కు అందరిదీ అన్న నినాదంతో సాగిన ఈ పోరుకు కాంగ్రెస్ తో సహా టీడీపీ, ఇతర వామపక్ష అనుబంధ సంఘాలు రావడం, తమ సంఘీభావం తెలపడం బాగుంది. వాన ను సైతం లెక్కచేయక నిన్నటి రోజు తమ గొంతుకలు వినిపించారు.
ప్రధాని వీటిని పట్టించుకోకపోయినా మీడియా కాస్త పట్టించుకు న్నందుకు ఒకింత సంతోషంలో ఉన్నారు కామ్రెడ్లు. తమ పోరుకు అటు కాంగ్రెస్ నుంచి కూడా మంచి స్పందన రావడం, భవిష్యత్ కార్యాచరణకు మార్గం సుగమం అయిందని ఆనందంలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే వైసీపీకి చేరువవుతున్న కామ్రెడ్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా టీడీపీ కూడా బాగానే రియాక్ట్ అయింది. పెద్దగా నిరసనలకు హాజరు కాని గల్లా జయ దేవ్ లాంటి ఎంపీలు వచ్చి కూర్చోవడం మాట్లాడడం బాగనే ఉంది. అయితే కాంగ్రెస్ కు ఈ దీక్ష లబ్ధినా లేదా టీడీపీకి ఈ పరిణామం లబ్ధినా అన్నది చూడాలి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీకి ఇలాంటి పోరు స్వరాలు పూర్తిగా కలిసి వస్తాయి.