సీఎం కేసీఆర్.. ఈ పని కూడా సరిగ్గా చేయలేరా?
దీనిపై హైకోర్టు గత శుక్రవారం (డిసెంబర్ 9)న తీర్పునిచ్చిందన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అభ్యర్ధులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించిందని.. ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని కోరిందని.. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్ధులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అభ్యర్ధులు తమ ఆవేదనను కేటీఆర్, డీజీపీలకు సోషల్ మీడియాలో విన్నవించుకున్నా సమాధానం రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నాడా లేడో తెలియదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .. మీరేమో ఇవేమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతుంటారని సీఎం కేసీఆర్ను తప్పుబట్టారు. పాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యను తీర్చెదెవరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిల్చారని.. కేసీఆర్ తీరుతో కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చిందని.. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానంలోనే కొలువుల భర్తీలో మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోందని రేవంత్ మండిపడ్డారు.