వారెవా.. చైనాకు దీటుగా భారత్ మిస్సైల్స్?
విదేశీ కంపెనీలు వీటిని తయారు చేస్తున్న ఇవి భారత్ లోనే తయారు కావడం గమనార్హం. వీటి సామర్థ్యం 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఏ స్థావరాన్ని అయినా ఛేదించగల లక్ష్యం వీటి సొంతం. అలాంటి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడానికి భారత్ ఇప్పుడు ముందుకొచ్చింది. చైనా నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియని సమయంలో ముందు జాగ్రత్తగా ఉండటానికే ఇలాంటి క్షిపణులు తయారు చేసి పెట్టుకుంటున్నారు.
చైనా, పాకిస్థాన్ రెండు కలిసి ఎటాక్ చేసినా వాటిని తట్టుకుని ముందుకెళ్లాలంటే అంతటి సామర్థ్యం ఉన్న మిస్సైల్స్ మన సొంతమవ్వాలి. ఇలా ప్రతి దాంట్లో ముందుంటేనే రెండు దేశాలను ఎదుర్కొగలం. ఇలా అణ్వస్త్రాలను మోసు కెళ్లగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు ఇండియాలో తయారు కావడం హర్షించాల్సిన విషయం. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏడాదిగా యుద్ధం సాగుతోంది. వివిధ దేశాలపై ఆధార పడిన ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదే సొంతంగా ఆయుధ సామగ్రి మనదైతే శత్రవుతో పోరాటం చేసేందుకు చాలా అవకాశం ఉంటుంది.