పొత్తు చిక్కులు.. పవన్‌కు బాబు షాక్‌?

జనసేన, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల పొత్తు ఖరారైనా జనసేన కంటే టీడీపీ సీట్ల ఎంపిక విషయంలో ఎక్కువ ఆధిపత్యం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ జనసేన అడిగినా కుదరదని తెగేసి చెప్పేసింది. ఎందుకంటే బీజేపీని క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టి ఆ పార్టీ లీడర్ ను తీసుకొచ్చింది.


గుంటూరు 2 సీటు విషయంలో కూడా టీడీపీకి బలమైన నాయకుడు ఉన్నారు. కనుక ఆ సీటు విషయంలో జనసేన పార్టీ కంటే టీడీపీ అభ్యర్థి ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల  రామానాయుడు కు కన్మర్ప్ చేసినట్లు, విజయవాడ సెంట్రల్ బొండా ఉమకు కన్మర్ప్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.


విజయవాడ వెస్ట్ మాత్రం జనసేన క్యాండిడేట్ మహేశ్ కు కన్మర్ప్ అయినట్లు తెలుస్తోంది. అలాగే జగ్గయ్యపేట కూడా టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా చాలా చోట్ల పవన్ కల్యాణ్ అడిగినా స్థానాల్లో జనసేనకు బలమైన అభ్యర్థి లేరనే సాకు చెప్పడం కానీ, టీడీపీకి బలమున్న అభ్యర్థి ఉన్నారనే విషయం చెబుతూ తను అనుకున్న స్థానాల్లో పార్టీ పట్టు నిలుపుకునేందుకు బాబు గట్టి పట్టుదలతోనే ఉన్నారు. ఇలాంటి సందర్బం జనసేన అధినేతకు మొదటి సారి. కానీ గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తులను అడిగితే మాత్రం అసలు విషయం తెలుస్తుంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది టీడీపీ. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని వారికి ఎక్కడో ఓ చోట రెండు మూడు స్థానాలతో సరిపెట్టింది. కిందటి సారి కాంగ్రెస్ తో పొత్తు తో భాగంగా సింహా భాగం టీడీపీ తీసుకుని కొన్ని స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశమిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: