కొత్త హామీలతో బాబుకు జగన్ ఝలక్‌ ఇస్తారా?

ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రజలపై హామీల వర్షం కురిపిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో నెగ్గడం కోసం, పదవి కోసం, అధికారం కోసం వంద హామీలను ప్రకటించి, నెరవేర్చకపోతే ప్రజలలో ఆ పార్టీలపై నమ్మకం తగ్గిపోతుంది. కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం 100 హామీలకు బదులు పది హామీలను ఇచ్చి  అందులో ఏడు హామీలను నెరవేర్చేలా చేసుకు వస్తున్నారని తెలుస్తుంది.


దానిద్వారా ఎక్కువ హామీలను ఇచ్చి నెరవేర్చలేదనే అపవాదు రాకుండా జగన్ అలా చేసుకొస్తున్నాడని అంటున్నారు‌. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత జగన్ వచ్చి 125 హామీలను ఇచ్చారని తెలుస్తుంది. అయితే అందులో పర్ఫెక్ట్ గా నవరత్నాలను ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. అప్పటికి అందులో జాబ్ క్యాలెండర్ ఇంకా మద్య నిషేధం, ఈ రెండు హామీ పథకాలు సంపూర్ణ రీతిలో నెరవేర్చలేకపోతున్నారని తెలుస్తుంది.


ఆల్రెడీ ఆ విషయాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. అయితే హామీ పథకాలు సరిగ్గా నెరవేర్చలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలవడానికి ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసి పాత హామీలను సరికొత్త లెక్కలతో ప్రకటించింది. దాని ప్రకారం అమ్మ ఒడి పథకం అందరికీ వర్తింపజేసేలా చెయ్యడం ఒకటి.


18 ఏళ్లు దాటిన అమ్మాయిలకు 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా 1500 నెలకి పెన్షన్ ఇస్తామని, గ్యాస్ సిలిండర్లు ఇంకా రైతులకు ఇస్తామన్న 20వేల భరోసా ఇలా ఈ పథకాల ద్వారా తిరిగి ఇంటింటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట ధైర్యంగా. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి కౌంటర్ గా 20000 ఇచ్చే రైతు భరోసాని 25 వేలుగా మార్చింది. అలాగే డ్వాక్రా మహిళలకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్నారట. అయితే రైతు భరోసాలో కేంద్రం ఇచ్చే 6000 కూడా కలిసే ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: