ఎన్నికలలోపు చంద్రబాబు బయటకురాడా?
ప్రస్తుతం చంద్రబాబు నాయుడిపై 370 కోట్ల అవినీతి చేశాడని సీబీఐ కేసు పెట్టడంతో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. అదే విధంగా ఆయనపై మరిన్ని కేసులు పెడుతూ కక్ష సాధిస్తున్నారని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబును ఇరికించారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇలా చేయడం సరికాదని వాదిస్తున్నారు. జగన్ ను గతంలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాడు. కాబట్టే దానికి ప్రతీకారంగా ఇలా కేసుల మీద కేసులు వేస్తూ చంద్రబాబును బయటకు రాకుండా చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
చంద్రబాబుకు బెయిల్ ఇప్పించేందుకు ఎంతగా ట్రై చేస్తున్న ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి కక్ష సాధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రబాబు మరికొన్ని రోజులు జైల్లో ఉంటారేమో కానీ ఆయన్ని ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఆయన వయసు రీత్యా అయినా జైలు నుంచి విడుదల చేయాలని కోరుతున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.