కేజ్రీవాల్కు మరో షాకింగ్ న్యూస్.. ఉచ్చు బిగుసుకుంటోందా?
ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అర్వింద్ కేజ్రీవాల్కు ఇది మరో షాక్ అనుకోవచ్చు. మార్చి 21 న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ కి తరలించింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్.. బెయిల్ ముగిసిన అనంతరం... సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2 మధ్యాహ్నం తీహార్ జైల్లో లొంగిపోయారు.
అయితే ఇప్పటికే కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో సీబీఐ అరెస్టుతో పెద్దగా జరిగే నష్టం ఏమిటని కొందరు భావించవచ్చు. కానీ.. సీబీఐ కేసు వల్ల కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపు అవుతాయి. రేపు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఆయన విడుదలయ్యే అవకాశం ఉండదు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ వచ్చినప్పుడే కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపయ్యాయని చెప్పుకోవచ్చు.
ఈడీ కేసులో జైలులో ఉన్నా ఇంకా కేజ్రీవాల్ దిల్లీ సీఎంగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆ పదవిని ఆయన ఎవరికీ ఇవ్వలేదు. జైలు నుంచే పాలన సాగిస్తున్న సీఎంగా చరిత్ర సృష్టిస్తున్నారు. కానీ ఈ కేసుల దాడి పెరిగితే ఆయన సీఎం పదవి వదలక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. మొత్తానికి ఆప్ను అతలాకుతలం చేయాలన్న బీజేపీ తన లక్ష్యం నెరవేర్చుకునేలా కనిపిస్తోంది.