ప్రపంచంలో వరుసగా తీవ్ర పరిణామాలు..?
ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో కూడా తీవ్ర అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యునికేట్ అవ్వలేకపోతున్నామని బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కానీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పై జరిగిన దాడితో ఈ రెండు అంశాలు పక్కకి వెళ్లిపోయాయి. ప్రపంచం అంతా కూడా దానిపైనే చర్చ జరిగింది. ఈ అంశం కాస్త మరుగున పడుతున్న సమయంలో మైక్రో సాఫ్ట్ ఆగిపోవడం.. ప్రజలు ఇబ్బందులు పడటం జరిగిపోయింది.
వీటన్నింటి మధ్య స్పేస్ ఎక్స్ వ్యవహారం, సునీతా విలియమ్స్ గురించి మన వాళ్లు మాట్లాడటమే మర్చిపోయారు. ఒక అంశానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంతే తీవ్రతతో ఉన్న మరో అంశం మరుగున పడిపోతుది. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్ష పదవి నుంచి బైడెన్ తప్పుకోవడంతో మళ్లీ ఇప్పుడు అంతా దీని గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఈ సమస్యలకు పరిష్కారం దొరక్క ముందే వాటిని పక్కన పడేసి బ్రేకింగ్ కోసం ఆరాట పడుతున్నారు. దీంతో ప్రజా సమస్యలు, వారికి అవసరం అయిన అంశాల గురించి చర్చలు జరగడం లేదు.