చంద్రబాబు చేస్తున్న పనికి అల్లాడిపోతున్న వైసీపీ నాయకులు? నిజంగా ఇది జగన్ కి కోలుకోలేని దెబ్బే..!

నాయకులు ఒక్కొక్కరు కాదు.. గుంపుగానే ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. అది కూడా ఫైర్ బ్రాండ్లుగా పార్టీకి అండగా నిలిచిన నాయకులను కూటమి సర్కారు టార్గెట్ చేస్తోంది. గతాన్ని మరిచిపోని కొందరు తమ్ముళ్లు.. చంద్రబాబు చెవిలో జోరీగా మాదిరి మారిపోయారు. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు అయినా చర్యలు తప్పవన్న సంకేతాలను టీడీపీ అధినేత ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నాయకులకు చిక్కులు మొదలు అయ్యాయి.


ప్రధానంగా గతంలో వైసీపీ ఏ విధంగా అయితే గనులు లీజు పొందిన వారిని టార్గెట్ చేసుకొని వేధించిందో.. ఇప్పుడు అదే విధంగా కూటమి సర్కారు కూడా గనుల లీజులు, ఇసుక తవ్వకాలు వంటి వాటిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సీమలోని అనేక మంది నాయకులు అల్లాడిపోతున్నారు. ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న గనుల లీజులపైనే దెబ్బ పడితే తమ పరిస్థితి దారుణంగా మారుతుందని వారు అంతా ఆవేదన చెందుతున్నారు.


తాజాగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నాయుకుడు, పార్టీకి ఫండింగ్ చేసే రమేశ్‌ రెడ్డి గనుల కేసుల్లో చిక్కు కున్నారు. ఆయన  నిర్వహిస్తున్న గనుల లీజును సర్కారు రద్దు చేసేందుకు సర్కారు యత్నిస్తోంది. మరోవైపు లీజుకు తీసుకున్న స్థలం కంటే ఎక్కువ తవ్వకాలు జరిపారు అంటూ ఆయనపై గనుల శాఖ కేసులు నమోదు చేసి రూ.13 కోట్ల జరిమానా విధించింది. ఈ పరిణామంతో జిల్లాలోని వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.


మెజార్టీ నాయకులు సీమలో గనుల వ్యాపారం చేస్తు ఉంటారు. ఇప్పుడు వారంతా తమ పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇలాంటి వారిని కాపాడాల్సిన అవసరం అధినేతకు ఉందని మరికొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫండింగ్ చేసే ఆర్థిక మూలాలు లేకపోతే అది అంతిమంగా పార్టీపై దెబ్బ పడేలా చేస్తుందని చెబుతున్నారు. ఇక చీమకుర్తి, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక లీజులు పొందిన వారికి కూడా ఉచ్చు బిగుస్తోంది. వీరిని కాపాడుకోకపోతే జగన్ కు మరింత ఇబ్బంది తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: