దీక్షతో పవన్ గ్రాఫ్ తగ్గిందా?

ప్రాయశ్చిత దీక్షతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దిశ దిశలకూ తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుమల శ్రీవారి ప్రసాదంలో అత్యంత దారుణమైన కల్తీ జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో దీనిపై కార్యాచరణను యుద్ధప్రాతిపదకన రూపొందించుకున్న పవన్ ఆ వెంటనే దీక్షకు దిగారు.


అయితే.. ఈ దీక్షపై రెండు రూపాల్లో స్పందన వచ్చింది. కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడారు. ఇదే సమయంలో మరికొందరు దీక్షను తప్పు పట్టారు. ఇక మెజార్టీ మేధావులు, హిందూ వర్గాల కూడా.. దీక్షను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలు వ్మక్తం అవుతున్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో తాను కమ్యూనిస్టు భావాలు ఉన్న నాయకుడిని అని ఆయనే చెప్పుకున్నారు. తనకు చేగువేరా వంటి వారు ఆదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తి నేరుగా పోయి పోయి హిందూ సంప్రదాయాన్ని కల్తీని భుజాన వేసుకొని దీక్షకు కూర్చోవడాన్ని కొందరు పట్టించుకోవడం లేదనే వాదన ఉంది.


ఇక కీలకమైన మాస్ ఓటింగ్ విషయానికొస్తే పవన్ కు ఎప్పుడూ ఉన్న ఇమేజే ఇప్పుడు కూడా ఉంది. దీనిలో పెద్దగా వచ్చిన మార్పు అయితే కనిపించడం లేదు. తొలత మంగళగిరిలో దీక్షను చేపట్టిప పవన్.. ఆ వెంటనే మరుసటి రోజు దుర్గమ్మ మెట్లు కడిగారు. దీనిపైనా విమర్‌శలు వచ్చాయి. దీక్షకు తగిన విధంగా ఫోకస్ లభించలేదని.. అందుకే ఆయన మెట్లు కడిగారని.. కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలు.. ప్రతి విమర్శలు ఎలా ఉన్నా దీక్ష తెచ్చిన గ్రాఫ్ ఎంత అనేది కీలకం.


ఈ విషయంలో పవన్ ఆశించినంత అయితే గ్రాఫ్ పెరగలేదు. దీక్ష చేశారు అంతే. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన కూటమి పార్టీలు.. పవన్ దీక్షకు దిగడంతో క్రెడిట్ ఆయనే సొంతం చేసుకున్నారన్న భావనలో మునిగిపోయారు అంతా.  దీంతో ఆయా పార్టీలు కూడా కొంత వరకు స్పందించి ఆగిపోయారు. ఒక నాయకుడిగా పవన్ ఇమేజ్.. దీక్ష ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన ఇమేజ్ పెద్దగా తేడా అయితే కనిపించలేదన్న విశ్లేషకులు మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: