ఇజ్రాయెల్ పై దాడి చేసినందుకు ఇరాన్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. ఆ ప్రకారమే డబ్బు కూడా మానవ సంబంధాలను ఏనాడో మాయం చేసింది. ఇప్పుడు ఏ పని చేసినా ఎంత డబ్బు ఖర్చు అయింది ప్రతి ఒక్కరు లెక్కలు వేసుకోవడం కామన్ అయింది. ఇది మనుషులకే కాదు.. దేశాల మధ్య సంబంధాలకు యుద్ధాలకు కూడా వర్తిస్తుంది. ఇదంతా ఎందుకు అంటే..


ఇజ్రాయెల్ ఇరాన్ ఏకబిగిన 180 బాలిస్టిక్,  హైపర్ సోనిక్ మిస్సైల్స్తో దాడి చేయడంతో ప్రపంచమే నివ్వెరపోయింది. ఒకప్పుడు ఇరాన్ స్కడ్ బాంబులతో దాడి చేయడం అప్పట్లోనే చాలా ఖరీదు అయిన వ్యవహారమని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పుడు జరిగిన దాడికి కూడా ఇరాన్ డబ్బును నీళ్లలాగే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇరాన్ వేసిన 181 బాంబులకు అయిన ఖర్చు చూస్తే గుండెలు ఆగిపోవాల్సిందే.  ఇంత ఖరీదైనదా అని ఆశ్చర్యపోతారు.


అక్టోబరు 1న ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన 181 బాలిస్టిక్ మిస్సైళ్లలో ఫతాహ్, ఖైబర్ షెకెన్ మిసైళ్లు ఉన్నాయి. ఈ మిసైళ్లు ధర ఒక్కోటి దాదాపుగా 3..5 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అంటే మన కరెన్సీలో ఒక్కోటి రూ.29 కోట్లు అనమాట. అంటే 181 మిసైళ్లకు దాదాపు రూ.5300 కోట్లు ఖర్చు అయింది. ఇరాన్ చరిత్రలో గంట పాటు సాగిన యుద్ధం అత్యంత ఖరీదైనదిగా నిలిచిపోవచ్చు.


ఇదిలా ఉంటే ఇరాన్ చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మిస్సైల్స్ ని సమర్థంగా తిప్పికొట్టింది. ఎందుకంటే ఇజ్రాయెల్ డోమ్ సిస్టం ద్వారా వీటిని తిప్పికొట్టింది. జనావాసాలు, ఆర్థిక నష్టం చేయని వాటిని వదిలేసింది. దీంతో ఇజ్రాయెల్ పై దాడి చేసిన పేరే తప్ప ఇరాన్ కు ఏ మాత్రం ఉపయోగం లేదు. పైగా గంటలో రూ.వేలకోట్లు నష్టం వాటిల్లింది. అందుకేనేమో.. ఈ దాడి ముగిసిందని దీనికి కొనసాగింపు ఉండదని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పై ప్రతి దాడి తప్పకుండా ఉంటుందని.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని బెంజిమాన్ నెతన్యాహూ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: