ఇక నుంచి న‌యా బెజ‌వాడ‌... 2.0 ..!

frame ఇక నుంచి న‌యా బెజ‌వాడ‌... 2.0 ..!

RAMAKRISHNA S.S.
బెజ‌వాడ కాస్తా విజ‌య‌వాడ‌గా మారి... నేడు అది గ్రేటర్ విజ‌య‌వాడ‌గా రూపుదిద్దుకుంటుంది.  రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల్లో క‌ద‌లిక‌తో న‌గ‌ర జ‌నాభా పెరిగింది .. విజ‌య‌వాడను అభివృద్ధి చేసేందుకు 2014లో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం గ్రేట‌ర్ అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 18 గ్రామాలను గ్రేటర్ విలీన జాబితాలో చేర్చాలని పెట్టినా. .. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసు కోలేదు.  టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏకంగా 45 గ్రామాలను గ్రేటర్ విలీన జాబితా పరిధి లోకి చేర్చ‌డ‌మే కాకుండా  గ్రామ పంచాయతీల తీర్మానాలు కూడా చేసింది. వైసీపీ వ‌చ్చాక ఈ ప్ర‌క్రియ‌కు బ్రేకులు ప‌డ్డాయి.

విజ‌య‌వాడ ప‌శ్చిమ బైపాస్ స‌మీప ప్రాంతాల రూపురేఖ‌ల‌ను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా జక్కంపూడి, కండ్రిక, పాతపాడు, నున్న, అంబాపురం, పి.నైనవరం ప్రాంతాలు శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విజయవాడ బైపాస్ కారణంగా నున్న, సూరంపల్లి వరకు  నిర్మాణ రంగం అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది. విజయవాడ బైపాస్ కారణంగా అవ‌త‌ల వైపు కూడా విస్తరణ దిశగా ముందుకు వెళుతోంది.  కానూరు నుంచి నిడమనూరు దిశగా ఈ ప్రాంతం విస్తరిస్తోంది.  . 

విలీనం కానున్న పలు ప్రాంతాలు...
గ్రేటర్ విజయవాడ రూపాంతరం చెందే క్రమంలో విజయవాడలో చాలా ప్రాంతాలు విలీనం కానున్నాయి. అటు నందిగామ నుంచి మొదలుపెడితే ఇటు మైలవరంతో పాటు తూర్పున ఉన్న పెనమలూరు కంకిపాడు  వంటి ప్రాంతాలు గ్రేటర్ విజయవాడ లో కలిసి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గన్నవరం, హనుమాన్ జంక్షన్ వరకు కూడా విస్తరించి ఉన్న కృష్ణాజిల్లా గ్రేటర్ విజయవాడ లో కలిసే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే గ్రేటర్ విజయవాడకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: