
తట్ట మట్టి ఎత్తకుండా.. రూ. 1426 కోట్ల కాంగ్రెస్ దోపిడీ.. హరీశ్ షాకింగ్?
హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉండి తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం హడావుడిగా పనులు ప్రారంభించి, డీపీఆర్ లేకుండానే బ్యారేజీలు కట్టారని ఆరోపించారు. 160 కోట్ల పనులకు 1426 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2300 కోట్లను దోచుకుందని, ఇందులో ఉత్తమ్, సుదర్శన్ రెడ్డి భాగస్వాములని ఆరోపించారు.
తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని 2015లో కేంద్ర జలసంఘం స్పష్టం చేసిందని హరీశ్ రావు తెలిపారు. మహారాష్ట్ర అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద 280 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చిందని వివరించారు. ఆయకట్టు, జలాశయాల సామర్థ్యం పెరిగితే ప్రాజెక్టు ధర పెరగడం సహజమని సమర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రాణహిత-చేవెళ్ల ధరను 17 వేల కోట్ల నుంచి 38 వేల కోట్లకు పెంచిందని గుర్తు చేశారు.
94905 20108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు