కవిత పోరు.. కృష్ణారావు పోరు.. రేవంత్ రెడ్డి తీరుస్తారా?
మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పై పలు ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ప్రత్యారోపణలు చేశారు. ఐడీపీఎల్ భూములతో సంబంధం లేదని కవిత ఖండిస్తూ లీగల్ నోటీసులు పంపారు. ఈ పరస్పర ఆరోపణలు రాజకీయ వివాదంగా మారాయి. బీఆర్ఎస్ నాయకులు గత పాలనలో భూమార్పిడి అనుమతులు ఇచ్చి అక్రమాలకు తలుపులు తెరిచారని కవిత విమర్శించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాలు అమలు చేస్తోందని ఆమె అన్నారు. ఈ వివాదం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంగా రూపాంతరం చెందింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐడీపీఎల్ భూములపై సమగ్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గత లావాదేవీలు, లీజులు, అనుమతులు, కబ్జాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. తమ జాగృతి కృషి వల్లే విచారణ జరుగుతోందని, నిజాయితీగా దర్యాప్తు చేస్తే సత్యం బయటపడుతుందని ఆమె అన్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు