ప్రతి విద్యార్థి జీవితంలోనూ కీలకమైనది పదో తరగతే. ఎందుకంటే మన భవిష్యత్ జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది పదో తరగతి తర్వాతే నిర్ణయించుకోవాలి. అయితే ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా డిగ్రీ సర్వ సాధారణం అయిపోయింది. కానీ.. కేవలం పదో తరగతి పాస్ అయితే చాలా అద్భుతమైన ఉగ్యోగవకాశాలను పొందవచ్చు.
వివరాల్లోకి వెళ్తే.. సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ - 1460, డీజిల్ మెకానిక్ - 640, వెల్డర్ - 597, ఏసీ మెకానిక్ - 249, ఎలక్ట్రీషియన్ - 871, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 102, మెకానిస్ట్ - 74, పెయింటర్ - 40, ఎంఎండబ్ల్యూ - 34, ఎలక్ట్రికల్ - 18, ఎంఎంటీఎం - 12, కార్పెంటర్ - 16
వయోపరిమితి: అభ్యర్ధులు 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు. sc, st అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: అభ్యర్ధులు పదోతరగతి 50శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. sc, st, మహిళలకు ఎటాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 11, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 8, 2019.