నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ఉద్యోగాలు.. అర్హత ఏంటంటే?
అయితే ఇలాంటి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఎన్ఐఈ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 52 ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ సీనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ.
విద్యార్హత విషయానికి వస్తే.. పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణతతో పాట నిర్దిష్ట అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక విధానం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి రూ.18 వేల నుంచి రూ.64 వేల వరకు వేతనం ఉంటుంది. 30-40 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.
దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 24, 2020 చివరిగా తేదీగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను. nieprojectcell@nieicmr.org.in ఈ-మెయిల్ ఐడీకి దరఖాస్తు పంపాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://nie.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.