గుడ్ న్యూస్: ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

Kothuru Ram Kumar
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. వారికీ అండగా ఉండేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నవంబర్ 3 లోగా మొదట నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ https://www.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఆ తర్వాత నవంబర్ 10 లోగా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ లో అప్లై చేయాలన్నారు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అన్నారు.

ఇక ఈ నోటిఫికేషన్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 70ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 10, సివిల్ ఇంజనీరింగ్- 35, మెకానికల్ ఇంజనీరింగ్- 75, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 20, కెమికల్ ఇంజనీరింగ్- 10, మైనింగ్ ఇంజనీరింగ్- 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్- 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 85, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 10, సివిల్ ఇంజనీరింగ్- 35, మెకానికల్ ఇంజనీరింగ్- 90, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 25, మైనింగ్ ఇంజనీరింగ్ 30, ఫార్మాసిస్ట్- 15 ఖాళీగా ఉన్నాయి.

ఇక ఈ నోటిఫికేషన్ దరఖాస్తు 2020 అక్టోబర్ 15న ప్రారంభం అవుతుంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్‌లో దరఖాస్తుకు 2020 నవంబర్ 3 చివరి తేదీ. ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు 2020 నవంబర్ 10 చివరి తేదీ. విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్, టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. ఇతర అర్హతలు- 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో పాసైనవారు మాత్రమే అప్లై చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసినవాళ్లు, అప్రెంటీస్ చేస్తున్నవారు అప్లై చేయకూడదు. స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.15,028, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.12,524 ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: