జేఈఈ మెయిన్స్ లో గందరగోళం.. కొత్త నోటిఫికేషన్ విడుదల..!!

Satvika
ప్రస్తుతం కరోనా ప్రభావం తొలగిపోవడంతో గత ఏడాది వాయిదా పడిన పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా జరగనున్న మెయిన్ ఎగ్జామ్స్ ను ఇప్పుడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ కూడా నిర్వహించనుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్ లో గందరగోళం ఏర్పడటంతో పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం.



జేఈఈ మెయిన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన పరీక్ష. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎగ్జామ్‌.. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే టెస్ట్. అయితే పరీక్ష నిర్వహణ అనేది అన్నీ కట్టు దిట్టమైన చర్యల నడుమ జరుగుతుంది. ఈ పరీక్షలను నిర్వించడానికి ఒక్క పక్కా ప్రణాళిక ఉండాలని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.



షెడ్యూల్‌ విడుదలలోనే గందరగోళాన్ని సృష్టించింది.దేశవ్యాప్తంగా ఇంటర్మీడియేట్‌/12వ తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయని.. వచ్చే జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చని ఎన్టీఏ పేర్కొన్నారు..ఈ పరీక్షలను పిభ్రవరి లో మొదలు పెట్టీ... మే నెల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.ఈ పరీక్షలకు విద్యార్థులు నాలుగు సార్లు అయిన హాజరు కావొచ్చు లేదా ఒకసారి మాత్రమే హాజరు కావచ్చునని..రాసిన పరీక్షల్లో అత్యధిక మార్కులను పరిగణనలోకి తీసుకొని నాలుగు విడతల పరీక్షల తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈసారి నుంచి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ సహా అన్ని  భాషల్లో  పరీక్షా పత్రాన్ని అందజేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: