
భారతీయ రైల్వేలో ఖాళీలు ఉన్న టీచర్ పోస్ట్ వివరాలు ఇవే..
వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రైమరీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత https://wcr.indianrailways.gov.in/ వెబ్ సైట్ పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన టీచర్లు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఖాళీలను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు లను నోటిఫికేషన్లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్కు చివరి తేదీలోగా మెయిల్ పంపాలి.ఇకపోతే దరఖాస్తుకు చివరి తేదీ- ఫిబ్రవరి 15 -2021
విద్యార్హతలు- ప్రైమరీ టీచర్.. పోస్టుకు 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు గ్రాడ్యుయేషన్తో పాటు బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 65 ఏళ్లు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం..
ప్రైమరీ టీచర్- పోస్టుకు రూ.21,250, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు రూ.26,250, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు రూ.27,500
వీటితో పాటుగా మరి కొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు..