నిరుద్యోగులకు ఈసీఐఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. దేశంలో కరోనా కారణంగా నిరుద్యోగ సమస్య పెరిగింది. ఈ సమస్యను కొంతవరకు అయిన తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ కంపెనీ ఈసీఐఎల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ 650 ఇంజనీర్ ఉగ్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈవీఎం, వీవీపాట్లకు సంబంధించిన సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వాళ్ళు ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి. అందుకు సంబంధించిన లింక్ కూడా నోటిఫికేషన్ లో ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ జాబ్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలను పరిశీలిస్తే..
అర్హతలు..
ఫస్ట్ క్లాస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు.
ఇతర అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడు రోజుల్లోపు ఈసీఐఎల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 2 గంటలలోపు ఆన్లైన్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ కాపీని తీసుకోవాలి. అభ్యర్థుల బీటెక్ మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాల వల్ల అందరికీ చాలా వరకు ఆర్ధిక లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు..