UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!
గుంజన్ 2016లో మొదటిసారిగా UPSC పరీక్షకు హాజరయ్యింది.కానీ ప్రిలిమ్స్లో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇంకా ఆమె రెండో ప్రయత్నంలో కూడా ఎలాంటి విజయం సాధించలేదు. ఆమె తన వ్యూహాన్ని మళ్లీ రూపొందించుకుంది. ఇక 2018లో ఆల్ ఇండియా ర్యాంక్ 9ని సాధించడానికి మొదటి నుండి కష్టపడి పని చేసింది. దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె విజయం సాధించింది.యుపిఎస్సిలో విజయం సాధించాలంటే ముందుగా ఎన్సిఇఆర్టి పుస్తకాలతో మీ పునాదిని బలోపేతం చేసుకోవాలని గుంజన్ ద్వివేది అభిప్రాయపడ్డారు. మీరు దీన్ని మొదట్లో చేస్తే, తరువాత మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ప్రిపరేషన్ను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయడం కూడా చాలా ముఖ్యం అని గుంజన్ చెప్పారు. సిలబస్ను పూర్తి చేసిన తర్వాత, మీకు వీలైనంత వరకు రివైజ్ చేయండి మరియు సమాధానం రాయడం సాధన చేయడం మర్చిపోవద్దు. యుపిఎస్సి పరీక్షల్లో విజయం సాధించాలంటే గరిష్ఠ కృషి ఒక్కటే మార్గం.