AP : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ సంవత్సరానికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ సంవత్సరానికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది.ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ సంవత్సరానికి ఏయే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఆ ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.ఇక ఈ ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరుల్ని అందించే విధంగా ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వీఆర్‌వీఆర్‌ నాయక్ తెలిపారు.పాలిటెక్నిక్ ఇంకా అలాగే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 'స్కిల్‌ హబ్స్‌' ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మంచి శిక్షణ ఇవ్వనున్నారు.




అలాగే పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణని ఇచ్చే విధంగా కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.కాగా, రాష్ట్రంలో మొత్తం 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చినట్లు నాయక్‌ తెలిపారు. అలాగే మిగిలిన పరిశ్రమలకు కూడా అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్‌ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో పలు పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా కడప జిల్లాలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు ఇంకా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: