136 ఏఈ నియామకాలకు త్వరలో ప్రకటన...!!

Shyam Rao

సహాయ ఇంజినీర్లు (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీట్రాన్స్‌కో సిద్ధమవుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 27వ తేదీ వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉండనున్న నేపథ్యంలో ప్రకటన జారీకి అనుమతివ్వాలని ఎన్నికల సంఘానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. మొత్తం 136 పోస్టులను మూడు జోన్లకు విభజించారు. విశాఖజోన్‌కు 46, విజయవాడకు 45, కడప జోన్‌కు 45 పోస్టుల చొప్పున కేటాయించారు. ఏపీజెన్‌కోలో 94 ఏఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: