తిరుపతిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుధవారం నుంచి వారంపాటు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎస్వీయూలోని సంస్థ కార్యాలయంలో రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏజీఎస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రక్రియను చేపడుతోంది. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు హాజరుకావచ్చు. వివరాలకు.. 99668 43255 నెంబర్లో సంప్రదించాలని తిరుపతి ప్రాంత అధికారి ఆర్.లోకనాథం తెలిపారు.