పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు మళ్లీ తగ్గిన బంగారం ధరలు..!

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకు భారీగా తగ్గుతూ వస్తోంది. లాక్ డౌన్ లో ఆకాశాన్ని తాకిన ధరలు అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో బంగారం ధరలు మెల్లిగా తగ్గతూ వస్తున్నాయి. వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తోంది.

హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర కూడా భారీగా తగ్గుతూ వస్తోంది. బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 తగ్గడంతో ధర రూ.రూ.54,270కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300కి తగ్గడంతో రూ.49,200కి చేరింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది. దీంతో పసిడి ప్రియులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,660, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,200కి చేరింది.

దేశీయ మార్కెట్ లో పసిడి తగ్గడంతో వెండి కూడా పసిడి బాటలోనే అడుగేసింది. మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.650 తగ్గడంతో ధర రూ.65,500 కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490కి తగ్గడంతో ధర రూ.54,380కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ.49,850కు చేరింది.

ఇక కేజీ వెండి ధర కూడా తగ్గింది. 10 గ్రాముల వెండిధర రూ.655 తగ్గడంతో రూ.65,550 కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని,  బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: