స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి..!
గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గతూ వచ్చి స్వల్పంగా పెరుగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,920, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,520కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,420కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,420 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,090, 22 క్యారెట్ల ధర రూ.47,720కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,770. 24 క్యారెట్ల ధర రూ.52,110 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా కొనసాగినా వెండి ధర తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన వెండి ధర తగ్గింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.60,600కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,800కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49,320కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.60,600కు చేరింది. గత కొంత కాలంగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.