పసిడి ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. !!!

Satvika
పసిడి ప్రియులకు ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లు వింటున్నారు.. దసరా వరకు  ఆకాశం వైపు చూసిన బంగారం రేట్లు ఈరోజు పూర్తిగా కిందకు పడిపోయాయి..దీపావళి నుంచి ధరలు కాస్త జనాలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా పసిడి ధర పూర్తిగా తగ్గిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పాలి.. కొనుగోలు చేయడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

బంగారం ధరల పైనే వెండి ధరలు కూడా ఆధారపడుతుంది..మొన్నటి దాకా వెండి కూడా భారీగా పలికిన సంగతి తెలిసిందే.. అయితే రెండు రోజులు కాస్త ఊరట నిచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం గురువారం రోజు బంగారం ధరలు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 క్షీణించింది. రూ.49,750కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.600 తగ్గుదలతో రూ.45,600కు తగ్గింది.

ఇక వెండి విషయానికొస్తే ఈ కాస్త భారీగానే పెరిగింది.. ఏకంగా కిలో రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,800కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆడర్లు తగ్గడంతో ఈ ధరలు కిందకు పడిపోయాయి.. వెండి వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా చాలా మేరకు తగ్గిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1808 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 23.41 డాలర్లకు పైకి ఎగసింది..ఈరోజు పసిడి మాత్రం పూర్తిగా తగ్గాయి.  రేపటికి ఈ రేట్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: