మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే దారిలో వెండి..!!

Satvika
గత కొద్ది రోజుల నుంచి బంగారం , వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి..నిన్నటి రేటు తో పోలిస్తే.. ఈరోజు రేట్లు షాకిస్తున్నాయి.. ఇలానే రెట్లు పెరిగితే నూతన సంవత్సరం కు కొనుగోలు చేసేవారు సంఖ్య భారీగా తగ్గిపోతుందని తెలుస్తుంది. నిన్న కాస్త కిందకు దిగిన ఈ ధరలు ఇప్పుడు పైకి కదిలాయి. ఈరోజు రేటు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.. ప్రస్తుతం బంగారం రేట్లు పరుగులు పెడుతున్నాయి..బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది చేదు వార్త అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.



అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగు పెడుతున్న కారణంగా ఇండియా. మార్కెట్ లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పైకి కదిలింది. రూ.51,380కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.290 పెరుగుదలతో రూ.47,100కు పెరిగింది..



ఇకపోతే బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఏకంగా రూ.2,100 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.73,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరగడంతో వీటి ధరలు పైకి కదిలాయి.. మార్కెట్ లో వెండి వస్తువులకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది..అయితే , అంతర్జాతీయ మార్కెట్ లో వీటి రేట్లను పరిశీలిస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1885 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 26.45 డాలర్లకు చేరింది. రేట్లు పెరగడం అనేది ఆ వస్తువుల డిజైన్లు, బంగారం, వెండి నిల్వలు తగ్గడం తో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: