పసిడి ప్రియులకు భారీ షాక్.. పరుగులు పెట్టిన వెండి..

Satvika
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి..దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఝలక్. బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. ఈరోజు కూడా పసిడి రేటు పైకి కదిలింది. దీంతో బంగారం ధర వరుసగా రెండు రోజులుగా పెరుగుతూనే వస్తున్నట్లు అయ్యింది.


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం వల్ల దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగింది. రూ.48,550కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 పెరుగుదలతో రూ.44,500కు ఎగసింది. ఇక వెండి కొనాలని భావించేవారికి చేదువార్త.. వెండి ధరలు భారీగా పెరిగాయి.

 
ఏకంగా రూ.1900 పెరిగింది. దీంతో కేజీ వెండి  రూ.76,100కు ఎగసింది. వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.89 శాతం పరుగులు పెట్టింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1831 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 27.55 డాలర్లకు ఎగసింది. పసిడి రేట్లపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, కరోనా, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: