పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహారం అత్యవసరమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం వరకూ దేశంలో వ్యవసాయం 80శాతం ఉంటే ప్రస్తుతం 60 కంటే తక్కువకు పడిపోయిందని వ్యవసాయ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయంపై రైతులకు నష్టాలు ఎక్కువ కావడం, నేటి తరం వ్యవసాయంపై విముఖత చూపించడమే ఇందుకు ముఖ్య కారణం. సేంద్రీయ పద్ధతుల్లో పండించే పంట కంటే ఎరువులతో పండించే పంటలు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజా ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు ఎక్కువగా ఉంటోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర రాని రైతులు వాటిని కార్పొరేట్ సంస్థలకు వచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. మరికొందరు రైతులు పంటను పాడేసుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే అదనుగా కార్పొరేట్ సంస్థలు రైతులను డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంటున్నారు. గత ఏప్రిల్ నెలలో బంగాళదుంపలు పండించే రైతులపై పెప్సీకో కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.
{{RelevantDataTitle}}